Category: Andhra Pradesh

Kaikaluru – 53వ రోజుకు చేరిన అన్నా క్యాంటిన్..

కైకలూరు నియోజకవర్గం లో 53వ రోజు అన్నా క్యాంటిన్ నిర్వహణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాలు మేరకు డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ 53 రోజుకు చేరింది. శనివారం అన్నదాతగా ఆవకూరు గ్రామస్తులు మాజీ కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమల శెట్టి రామాంజనేయులు సతీమణి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుమారు 400 మందికి అన్నదానం అందించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబీ), తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పులా రాజి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాలు మేరకు దాతల సహాయం ... Read more

Kaikaluru – పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ను కలిసినన ఎన్డీఏ కూటమి నాయకులు.

కైకలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన పి కృష్ణా ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించిన తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పూల రామచంద్రరావు(రాజి), జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబి), జనసేన నాయకులు తులసి పూర్ణ, ఘంటశాల చందు, తదితరులు.

kaikaluru – చంద్రబాబు కటౌట్ కు పాలాభిషేకం.

కైకలూరు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చిత్రపటం (కటౌట్) కు పాలాభిషేకం చేసిన అర్చకులు. ప్రైవేటు దేవస్థానములో ధూపదీప నైవేద్యాలు సమర్పించేందుకు ప్రతినెలా పదివేల రూపాయలు ప్రభుత్వం నుండి అర్చకులకు అందేలా జీవో విడుదల చేయడంతో చంద్రబాబు కటౌట్ కు పాలాభిషేకం చేసిన అర్చకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు దైవం అండగా ఉండాలని అర్చకులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో యమ్ ఎ రహీమ్, కె కె బాబు, వీరాబత్తిన సుధ, పి రాధాకృష్ణ, లక్కింశెట్టి మోహన్, సదర్ల సూరి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

venkayya naidu: రాజధాని అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి..

బాపట్ల – ఏపీ రాజధాని అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రతో మ్యూజియం ఏర్పాటు చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. మహనీయుల జీవిత చరిత్రలు నేటి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జాగర్లమూడిలో మాజీ ఎమ్మెల్యే కుప్పుస్వామి చౌదరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయనకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చీరాల రైల్వేస్టేషన్‌‌లో ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం వెంకయ్య నాయుడు కుప్పుస్వామి చౌదరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొన్నారు.

నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ 26 గేట్ల ద్వారా నీటిని విడుదల

నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ 26 గేట్ల ద్వారా శుక్రవారం నీటిని విడుదల చేసిన అధికారులు. 22 క్రస్ట్‌గేట్లను 5 అడుగులు, 4గేట్లను 10అడుగుల మేర ఎత్తి 2,30,504 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జునసాగర్‌ జలాశ యం నీటిమట్టం 587.50 అడుగులు ఉంది. ఇది 305.80 టీఎంసీలకు సమానం. కుడి కాలువ ద్వారా 8680 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 8367, 26 క్రస్ట్‌గేట్ల ద్వారా 2,30,504, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 29,029, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 2,78,380 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్‌గా 3,11,491 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కాగా 26 క్రస్ట్‌గేట్ల ద్వారా నీరు విడుదల చేస్తుండడంతో తిలకించేందుకు పర్యాటకులు శుక్రవారం పోటెత్తారు. రహదారులు పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి. పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ సందడిగా గడిపారు. 42 టీఎంసీలకు చేరిన నదీ జలాలు వరదతో ... Read more

గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో భార్య భర్తలు మృతి : తాడేపల్లిగూడెం

తాడేపల్లిగూడెం మండలంలో గ్యాస్‌ లీకై అగ్నిప్రమాదం సంభ వించడంతో గాయాలపాలైన కుటుంబం తాడేపల్లిగూడెం ఏరియా ఆసు పత్రిలో చికిత్స పొందుతున్నారు. భార్య, భర్తలు గురువారం మృతి చెందారు. తాడేపల్లిగూడెం మండలం ఎల్‌.అగ్రహారంలోని టిడ్‌కో ఇళ్ల వద్ద మంగళవారం ఉదయం గ్యాస్‌ బండ పేలిన ఘటనలో భార్య భర్తలు బోడపాడు మురళి (37), బోడపాడు కుమారి (34), కుమార్తె నీలిమలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో వారిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మురళి, కుమారిలు గురువారం మృతి చెందారు. నీలిమకు చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రమేష్‌ వివరించారు.

ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యo ఎమ్మెల్యే చింత మనేని ప్రభాకర్‌.

ప్రజా సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధి చంద్ర బాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని ఎమ్మెల్యే చింత మనేని ప్రభాకర్‌ అన్నారు. తోటగూడెంలో గురువారం జరిగిన మీ కోసం – మీ చింతమనేని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామసభ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుని, వారి నుంచి వినతులు స్వీకరించారు. తాగు, సాగు నీరు, గ్రామాల్లో పారిశుధ్యం, డ్రెయిన్ల మరమ్మతు, అంతర్గత రహ దారులు అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందజేస్తామన్నారు. గ్రామసభ ద్వారా దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కా రానికి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఉప్పలపాటి రామ్‌ప్రసాద్‌, గుత్తా అనిల్‌, లావేటి శ్రీనివాసరావు, పెద్ది రమేష్‌, కంభంపాటి సునీల్‌కుమార్‌, దండమూడి సీతారాం ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు

శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. గత నెల జూలైలో ప్రారంభమైన వరద ప్రవాహంతో క్రమంగా జలాశయం నిండుకుంది. జూలై 29 తేదీన జలాశయం మూడు క్రస్టు గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ పరివాహక ప్రాంతాలు జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుండడంతో శుక్రవారం డ్యామ్‌ అధికారులు జలాశయం 10 క్రస్టుగేట్లును 14 అడుగులు ఎత్తి నీటిని దిగువ నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 2,89,265 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 40,311 క్యూసెక్కులు మొత్తం 3,29,576 వరద ప్రవాహం వస్తోంది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 3,92,415 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు ... Read more