Blog

వృద్ధులను ఆదరించకుంటే జైలు శిక్ష తప్పదు

వయోభారంలో ఉన్న వృద్ధులను వారి వారసులు ఆదరించకుండా ఇబ్బంది పెడితే జైలు శిక్ష తప్పదని సీనియర్ సివిల్ జడ్జి వివిఎన్వి లక్ష్మి హెచ్చరించారు. కైకలూరు కోర్టు ప్రాంగణంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయావృద్ధుల సంక్షేమ చట్టం 2007 ప్రకారం వారిని ఆదరించాలన్నారు. తల్లిదండ్రుల పోషణను విస్మరిస్తే వారి ద్వారా వారసులకు సంక్రమించే ఆస్తిని వెనుకకు తీసుకునే అవకాశం ఉందన్నారు. నిరాకరణకు గురైనట్లుగా రుజువైతే మూడు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని సూచించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పోషించే బాధ్యత వారి పిల్లలదేనని తెలియజేశారు. ఆ విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని, తల్లిదండ్రుల పోషణ నిమిత్తం వారికి కూడా మనోవర్తి ఇవ్వవలసి ఉంటుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పానల్ అడ్వకేట్స్ పి పవన్ కాంత్, డి శివప్రసాద్, బి ఇందిర తదితరులు పాల్గొన్నారు.

శ్రీ శ్యామలాంబ అమ్మవారి దసరా మహోత్సవాలు పోస్టర్ ఆవిష్కరణ

కైకలూరులోని శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో నిర్వహించనున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగ, అత్యంత వైభవోపేతముగా నిర్వహించాలని స్థానిక శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ సూచించారు. శ్రీ శ్యామలాంబ అమ్మవారి గోడపత్రిక, ప్రచార పత్రికలను మంగళవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఇలవేల్పు దేవత అయిన శ్రీ శ్యామలంబ అమ్మవారి దసరా మహోత్సవాలు విజయవంతం గా నిర్వహించాలన్నారు. తదనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సమకూర్చాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. సామాన్య భక్తులకు సునాయాసంగా అమ్మవారి దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయాలని, ప్రసాద నాణ్యతలో ఎక్కడ లోపం జరగకూడదన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ దగ్గరుండి పర్యవేక్షించి దసరా మహోత్సవాలను విజయవంతం చేస్తామన్నారు. కార్యనిర్వణ అధికారి విఎన్ కే శేఖర్ మాట్లాడుతూ అమ్మవారి భక్తులకు ఉచిత ప్రసాద, జల ప్రసాదం తో సహా అన్ని ... Read more

 AP BJP వారధి, Purandeswari – తిరుమల లడ్డూపై సమీక్ష చేసిన తర్వాతే సీఎం చంద్రబాబు మాట్లాడారు

సమీక్ష చేసిన తర్వాతే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన విషయాన్ని ప్రజలకు సీఎం చంద్రబాబు తెలియజెప్పి ఉంటారని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనేది పరిగణలోకి కోర్టు తీసుకుంటుందని పురంధేశ్వరి పేర్కొన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు వచ్చిన సమాచారంతో ఆయన ప్రకటన చేశారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. అధికారులతో సమీక్ష చేసుకున్న తర్వాతే తిరుమల లడ్డూ విషయంపై మాట్లాడి ఉంటారని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనతరం ఆయా సమస్యలపై అధికారుతో మాట్లాడారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. సీఎంగా ఆయన అపచారం జరిగిన విషయాన్ని ప్రజలకు తెలియ చెప్పి ఉంటారని చెప్పారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనేది పరిగణలోకి కోర్టు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని ‘మీరు ఎందుకు ... Read more

Education decisions : ఇండియాలోనే చదువుకోవాలా? విదేశాలకు వెళ్లాలా? ఇవి తెలుసుకుని నిర్ణయం తీసుకోండి..

Education in India : భారత్​ దేశంలో చదువుకోవాలా? లేక చదువు కోసం విదేశాలకు వెళ్లాలా? ఈ ప్రశ్న మిమ్మల్ని వేధిస్తోందా? అయితే ఇది మీకోసమే! కొన్ని విషయాలు మీరు తెలుసుకుంటే, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు. అవేంటంటే.. Telugu Hindustan Times

Holidays – పాఠశాలలకు దసరా సెలవులు

ఈనెల 3వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభంకానున్నాయి. ఈనెల 3న గురువారం నుంచి 13వ ఆదివారం తేదీ వరకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించిది. మొత్తం 10 రోజుల పాటు పండగ సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దసరా సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 12వ తేదీన దసరా పండుగ రానుంది. ఈ క్రమంలో పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 3వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈనెల 3 గురువారం నుంచి – 13 ఆదివారం తేదీ వరకు దసరా సెలవులను ప్రకటిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 10 రోజుల పాటు పండగ సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దాసర సెలవల అంతరం ఈనెల 14 సోమవారం తేదీన స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉదయం ... Read more

Bulldozer action : ‘ప్రజా భద్రతే ముఖ్యం- ఆ మతపరమైన నిర్మాణాలను..’- సుప్రీంకోర్టు-whether it is temple or dargah supreme court on bulldozer action ,జాతీయ

రహదారులు, జలవనరులు, రైల్వే లైన్లను ఆక్రమించే మతపరమైన నిర్మాణాల కంటే ప్రజా భద్రతకే ప్రాధాన్యమిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బుల్డోజర్​, ఆక్రమణ వ్యతిరేక కార్యకలాపాలపై తాము ఇచ్చిన ఆదేశాలు, మతాలకు సంబంధం లేకుండా అందరికి సమానంగా వర్తిస్తుందని పేర్కొంది. నేరస్థులపై బుల్డోజర్ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్​లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. Telugu Hindustan Times

తిరుమలలో మరోసారి చిరుత కలకలం..

శనివారం అర్ధరాత్రి సమయంలో తిరుమలలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది.. శ్రీవారి మెట్లు మార్గంలో చిరుత సంచారం.. అర్ధరాత్రి సమయంలో కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చిన చిరుత.. భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి లాక్ వేసుకున్న సెక్యూరిటీ గార్డ్.. టీటీడీ అటవీశాఖ అధికారులు సమాచారం ఇచ్చిన సెక్యూరిటీ గార్డ్.. సీసి టీవి ఫుటేజ్ పరిశీలించిన అధికారులు.

ట్రోలర్స్‌కు మను బాకర్ ఘాటు రిప్లై-manu bhaker counters trollers says she will show olympic medals ,స్పోర్ట్స్ న్యూస్

కానీ సోషల్ మీడియాలో కొందరు ట్రోలర్స్ మాత్రం మను బాకర్ ను లక్ష్యంగా చేసుకొని మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మెడల్స్ ను ఆమె అసలు వదలలేకపోతోందని, షో ఆఫ్ చేస్తోందని కామెంట్స్ చేశారు. దీనిపై ఆమె ఇలా ఘాటుగా స్పందించింది. పారిస్ ఒలింపిక్స్ లో ఇండియా ఆరు మెడల్స్ గెలవగా.. అందులో రెండు మను బాకర్ సాధించినవే. Telugu Hindustan Times