Blog

ఘనంగా పైడితల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ

ఘనంగా పైడితల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ పైడితల్లి అమ్మవారి నామస్మరణతో జువ్వలపాలెం గ్రామం మారుమోగింది. కాళ్ళ మండలం జువ్వలపాలెం గ్రామంలోని తూర్పుపేటలో భక్తులు, దాతలు, గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో నూతనంగా నిర్మించిన గ్రామదేవత పైడితల్లి అమ్మవారి ఆలయంలో విగ్రహం, ఆలయ శిఖర, జీవధ్వజ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు పుల్లేటికుర్తి గణపతిశర్మ బ్రహ్మత్వంలో గురువారం ఉదయం 9:30 నిమిషాలకు వేదమంత్రాల నడుమ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.నర్సాపురం పార్లమెంట్ మాజీ సభ్యుడు గోకరాజు గంగరాజు, టీడీపీ బోర్డు మాజీ సభ్యుడు గోకరాజు రామరాజు, జనసేన నాయకుడు చెనమల్ల చంద్రశేఖర్తో పాటు పలువురు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు

kolleru- కొల్లేరు సరస్సును సందర్శించండి – కామినేని శ్రీనివాస్

కొల్లేరు సరస్సును సందర్శించండి. గవర్నర్ ను ఆహ్వానించిన ఎమ్మెల్యే కామినేని కొల్లేరు సరస్సులోని పక్షుల కేంద్రాన్ని సందర్శించాలని రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీరు ఆహ్వానించినట్లు కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. అమరావతిలో గురువారం గవర్నర్ను కలసి ఆహ్వానించారు. ఈ నెల 17న నెల్లూరు స్వర్ణభారతీ ట్రస్ట్ 23వ వార్షికోత్సవంలో కూడా పాల్గొనాలని ఆహ్వానించారు. స్వర్ణభారతీ ట్రస్ట్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనకర్ కూడా హాజరవుతారని తెలిపారు.

చిట్టి దోసెలతో రోజుకు రూ.10 వేలు సంపాదిస్తున్న మహిళ, రుచి సూపర్ అంటూ కస్టమర్లు క్యూ-sri sathya sai district kutagulla village road side hotel woman making dosa earns 10k daily ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

[ad_1] నర్సమ్మ దోసెలు రుచిచూడాల్సిందే శ్రీ సత్యసాయి జిల్లా : కదిరికి సమీపంలోని కూటగుళ్ల గ్రామంలో నర్సమ్మ హోటల్ ఉంది. రోజుకు రూ.10 వేలు చొప్పున నెలకు దాదాపు రూ. 3 లక్షల వ్యాపారం జరుగుతుందని నర్సమ్మ తెలిపారు. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారం సాఫీగా సాగుతుందని అంటున్నారు. నర్సమ్మ హోటల్ లో వివిధ రకాల దోసెలు విక్రయిస్తారు. ఎగ్ ఎగ్ దోసె రూ. 25 , సాధారణ దోసెలు రూ. 10 , కారం దోసెలు రూ.25 అందిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం వరకు అమ్మకాలు జరుగుతాయని నర్సమ్మ తెలిపారు. రోడ్డు పక్కనే కావడంతో వాహనదారులు, ప్రయాణికులు ఈ హోటల్ కు వస్తుంటారు. నర్సమ్మ హోటల్ దోసెల రుచి తెలిసిన స్థానిక కూలీలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు అక్కడకు నిత్యం వస్తుంటారు. తక్కువ ఖర్చు, రుచికి అమోఘంతో నర్సమ్మ దోసెల కోసం క్యూ కడుతుంటారు. ఈ హోటల్ ... Read more