Category: Andhra Pradesh

kaikaluru : శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దసరా మహోత్సవాలు ప్రారంభం.

కైకలూరు సెంటర్ లో వేంచేసియున్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి క్షేత్రం నందు 44వ దసరా శరన్నవరాత్రి ఉత్సవములు శ్రీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సంఘం ఆద్వర్యంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్.కామినేని శ్రీనివాస్ కు ఆలయ మర్యాదలతో సత్కరించి ప్రసాదం అందించిన శ్రీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సేవాసంఘం అద్యక్షులు చొప్పర్ల మురళీకృష్ణ, సంఘ నాయకులు. పొన్నూరు కుటుంబ దంపతులచే కలశ స్థాపన చేసి పూజలు నిర్వహించిన అర్చకులు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ఆర్యవైశ్య నాయకులు, మాలధారణ భవానీలు, స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా చిత్రపటాలకు పూలమలలు : ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యం – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి.. సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి అంటూ నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదశ్ ఉపాధ్యాయ సంఘం ఎన్టీఆర్ జిల్లా శాఖ ద్వితీయ కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సత్యం, అహింస ఆయుధాలుగా భారత దేశపు స్వేచ్ఛా స్వాతంత్య్ర సమరాన్ని ముందుండి నడిపిన జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా చిత్రపటాలకు పూలమలలువేసి నివాళులు అర్పించారు. స్వరాజ్యం సాధించిన బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మన కర్తవ్యం కావాలన్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. వారి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యాశాఖ అంటే ఒక పరీక్ష. ఛాలెంజ్‌ ... Read more

లడ్డూ విషయంలో రాజకీయాలొద్దు, టీడీపీ, వైసీపీ, జనసేనకు రిక్వెస్ట్ – వైఎస్ షర్మిల

తిరుమల లడ్డూ వ్యవహారంలో హాట్ కామెంట్స్ చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఒకరేమో శాంతి పూజలు.. మరొకరు ప్రాయశ్చిత్త దీక్ష.. ఇంకొకరేమో ప్రక్షాళన పూజలని అంటున్నారని చెప్పారు.దయ చేసి ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని, మతం రంగు పులమడం అంతకంటే కరెక్ట్ కాదన్నారు. ఇంతకీ షర్మిల వ్యాఖ్యల వెనుక అసలేం జరుగుతోంది? ఇదే చర్చ ఏపీ అంతటా మొదలైంది. తిరుమల లడ్డూ అంశంపై సీబీఐ విచారణ చేపట్టాలని అందరి కంటే ముందు ఏపీ కాంగ్రెస్ డిమాండ్ చేసిందన్నారు వైఎస్ షర్మిల. లడ్డూ విషయాన్ని సుమోటోగా తీసుకుని విచారణ చేయాలని సీజేఐకి, అటు కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీ లేఖ రాసిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. సిట్ కంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరగాలన్న రీతిలో ఉన్నట్లు అర్థమవుతోంది షర్మిల. లడ్డూ విషయాన్ని రాజకీయం చేయొద్దని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మాజీ సీఎం జగన్ ... Read more

మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు – నివాళులుఅర్పించిన కామినేని

కైకలూరు గాంధీబొమ్మ సెంటర్ వద్ద స్వాతంత్ర సమరయోధులలో ప్రముఖులు జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులుఅర్పించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు. ఈ సందర్బంగా కామినేని మాట్లాడుతూ మన భారతీయులు అందరూ జాతీపిత గా పిలుచుకునే మహాత్మ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆశ్రమం పెట్టి, అలానే సత్యాగ్రహం ధ్వారా హింసతో కాకుండా అహింసతోనే మనం ఉండాలని ప్రజలకు వివరిస్తూ, అహింసతోనే తెల్లవారిని(బ్రిటిష్ వారిని) తరిమిన స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ అని. అందుకే మనం అందరం మహాత్మ గాంధీ అని పిలుచుకుంటున్నాము అని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Vangalapudi Anitha – 6,100 కానిస్టేబుల్స్ నియామక ప్రక్రియ.

రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయిదని, కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు. 6,100 పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య (PMT,PET) పరీక్షలను ఐదు నెలల్లోగా పూర్తి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. 2022లో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది హాజరుకాగా… 95,209 మంది తదుపరి దశకు ఎంపికయ్యారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సహా పలు కారణాల వల్ల వాయిదా పడడంతో కానిస్టేబుల్‌ (సివిల్‌)- 3,580, కానిస్టేబుల్‌ (ఏపీఎస్‌పీ) -2,520 పోస్టుల ప్రక్రియ వాయిదా పడిరదన్నారు. ప్రిలిమినరీ పరీక్షకు 3,622 మంది హోంగార్డులు హాజరుకాగా 382 మంది అర్హత సాధించారన్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించని 100 మంది హోంగార్డులు హైకోర్టులో 14 రిట్‌ పిటిషన్లు వేశార న్నారు. ప్రత్యేక కేటగిరీ కోటాలో ప్రత్యేక మెరిట్‌ జాబితా ను ప్రకటించాలని వారు కోర్టును ... Read more

వృద్ధులను ఆదరించకుంటే జైలు శిక్ష తప్పదు

వయోభారంలో ఉన్న వృద్ధులను వారి వారసులు ఆదరించకుండా ఇబ్బంది పెడితే జైలు శిక్ష తప్పదని సీనియర్ సివిల్ జడ్జి వివిఎన్వి లక్ష్మి హెచ్చరించారు. కైకలూరు కోర్టు ప్రాంగణంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయావృద్ధుల సంక్షేమ చట్టం 2007 ప్రకారం వారిని ఆదరించాలన్నారు. తల్లిదండ్రుల పోషణను విస్మరిస్తే వారి ద్వారా వారసులకు సంక్రమించే ఆస్తిని వెనుకకు తీసుకునే అవకాశం ఉందన్నారు. నిరాకరణకు గురైనట్లుగా రుజువైతే మూడు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని సూచించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పోషించే బాధ్యత వారి పిల్లలదేనని తెలియజేశారు. ఆ విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని, తల్లిదండ్రుల పోషణ నిమిత్తం వారికి కూడా మనోవర్తి ఇవ్వవలసి ఉంటుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పానల్ అడ్వకేట్స్ పి పవన్ కాంత్, డి శివప్రసాద్, బి ఇందిర తదితరులు పాల్గొన్నారు.

శ్రీ శ్యామలాంబ అమ్మవారి దసరా మహోత్సవాలు పోస్టర్ ఆవిష్కరణ

కైకలూరులోని శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో నిర్వహించనున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగ, అత్యంత వైభవోపేతముగా నిర్వహించాలని స్థానిక శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ సూచించారు. శ్రీ శ్యామలాంబ అమ్మవారి గోడపత్రిక, ప్రచార పత్రికలను మంగళవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఇలవేల్పు దేవత అయిన శ్రీ శ్యామలంబ అమ్మవారి దసరా మహోత్సవాలు విజయవంతం గా నిర్వహించాలన్నారు. తదనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సమకూర్చాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. సామాన్య భక్తులకు సునాయాసంగా అమ్మవారి దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయాలని, ప్రసాద నాణ్యతలో ఎక్కడ లోపం జరగకూడదన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ దగ్గరుండి పర్యవేక్షించి దసరా మహోత్సవాలను విజయవంతం చేస్తామన్నారు. కార్యనిర్వణ అధికారి విఎన్ కే శేఖర్ మాట్లాడుతూ అమ్మవారి భక్తులకు ఉచిత ప్రసాద, జల ప్రసాదం తో సహా అన్ని ... Read more

 AP BJP వారధి, Purandeswari – తిరుమల లడ్డూపై సమీక్ష చేసిన తర్వాతే సీఎం చంద్రబాబు మాట్లాడారు

సమీక్ష చేసిన తర్వాతే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన విషయాన్ని ప్రజలకు సీఎం చంద్రబాబు తెలియజెప్పి ఉంటారని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనేది పరిగణలోకి కోర్టు తీసుకుంటుందని పురంధేశ్వరి పేర్కొన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు వచ్చిన సమాచారంతో ఆయన ప్రకటన చేశారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. అధికారులతో సమీక్ష చేసుకున్న తర్వాతే తిరుమల లడ్డూ విషయంపై మాట్లాడి ఉంటారని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనతరం ఆయా సమస్యలపై అధికారుతో మాట్లాడారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. సీఎంగా ఆయన అపచారం జరిగిన విషయాన్ని ప్రజలకు తెలియ చెప్పి ఉంటారని చెప్పారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనేది పరిగణలోకి కోర్టు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని ‘మీరు ఎందుకు ... Read more