kaikaluru : శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దసరా మహోత్సవాలు ప్రారంభం.

కైకలూరు సెంటర్ లో వేంచేసియున్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి క్షేత్రం నందు 44వ దసరా శరన్నవరాత్రి ఉత్సవములు శ్రీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సంఘం ఆద్వర్యంలో వైభవంగా ప్రారంభమయ్యాయి.

శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్.
కామినేని శ్రీనివాస్ కు ఆలయ మర్యాదలతో సత్కరించి ప్రసాదం అందించిన శ్రీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సేవాసంఘం అద్యక్షులు చొప్పర్ల మురళీకృష్ణ, సంఘ నాయకులు.

పొన్నూరు కుటుంబ దంపతులచే కలశ స్థాపన చేసి పూజలు నిర్వహించిన అర్చకులు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ఆర్యవైశ్య నాయకులు, మాలధారణ భవానీలు, స్వాములు, భక్తులు పాల్గొన్నారు.