మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు – నివాళులుఅర్పించిన కామినేని

కైకలూరు గాంధీబొమ్మ సెంటర్ వద్ద స్వాతంత్ర సమరయోధులలో ప్రముఖులు జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులుఅర్పించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు. ఈ సందర్బంగా కామినేని మాట్లాడుతూ మన భారతీయులు అందరూ జాతీపిత గా పిలుచుకునే మహాత్మ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆశ్రమం పెట్టి, అలానే సత్యాగ్రహం ధ్వారా హింసతో కాకుండా అహింసతోనే మనం ఉండాలని ప్రజలకు వివరిస్తూ, అహింసతోనే తెల్లవారిని(బ్రిటిష్ వారిని) తరిమిన స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ అని. అందుకే మనం అందరం మహాత్మ గాంధీ అని పిలుచుకుంటున్నాము అని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.