kaikaluru – చంద్రబాబు కటౌట్ కు పాలాభిషేకం.

కైకలూరు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చిత్రపటం (కటౌట్) కు పాలాభిషేకం చేసిన అర్చకులు. ప్రైవేటు దేవస్థానములో ధూపదీప నైవేద్యాలు సమర్పించేందుకు ప్రతినెలా పదివేల రూపాయలు ప్రభుత్వం నుండి అర్చకులకు అందేలా జీవో విడుదల చేయడంతో చంద్రబాబు కటౌట్ కు పాలాభిషేకం చేసిన అర్చకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు దైవం అండగా ఉండాలని అర్చకులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో యమ్ ఎ రహీమ్, కె కె బాబు, వీరాబత్తిన సుధ, పి రాధాకృష్ణ, లక్కింశెట్టి మోహన్, సదర్ల సూరి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.